- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
- రాశిఫలాలు
దేశవ్యాప్తంగా ఎస్బీఐ అన్ని రకాల సేవలకు అంతరాయం!

ముంబై: దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సేవలకు గురువారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్న సమయం నుంచి అకస్మాత్తుగా ఎస్బీఐ అన్ని రకాల సేవలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ సమస్య వల్ల వినియోగదారులు నగదు బదిలీ, ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎం నగదు విత్డ్రా, ట్రాన్స్ఫర్ సహా అన్ని సేవల్లో సమస్య్లు ఉత్పన్నమయ్యాయి. యూపీఐ చెల్లింపుల్లో కూడా ఇబ్బందులు ఎదురైనట్టు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగాయి. ఎస్బీఐ యోనో యాప్ సైతం పనిచేయకుండా నిలిచిపోయింది.
యాప్ను వాడేందుకు ప్రయత్నించే వినియోగదారులకు మెయింటెనెన్స్ జరుగుతోందనే మెసేజ్ చూపిస్తోందని వారు చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాల ద్వారా ఖాతాదారులు ఫిర్యాదులు చేశారు. దీనిపై ఎస్బీఐ అధికారులు సమస్య పరిష్కారంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఎంతసేపటికీ సేవల పునరుద్ధరణ జరుగుతుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో వేతనాలు తీసుకునే ముందు ఇలాంటి సమస్య ఏర్పడటంతో ఎస్బీఐ ఖాతాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.