- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్బ్యూరో: మూసీనదిని సుందరంగా తీర్చిదిద్దే పనులు ప్రారంభయ్యాయని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డిసిఎల్) ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గండిపేట వద్ద ‘మూసీ రివర్ క్లీన్ అప్–2020’ కార్యక్రమాన్ని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సుధీర్రెడ్డి మాట్లాడుతూ మూసీ నది శుద్ధిచేసే పనులను శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. వచ్చే వర్షాకాలం సీజన్లో మూసీ నదిలో దోమల వ్యాప్తిని నిరోధించేందుకు ప్రత్యేకంగా దృష్టిసారించామని తెలిపారు. బాపూఘాట్ నుంచి నాగోల్ బ్రిడ్జి వరకు డ్రోన్ల సహాయంతో యాంటి లార్వా స్రే చేసి, దోమల నిర్మూలన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మూసీ సుందరీకరణ పనుల్లో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకొచ్చిన గండిపేట వెల్ఫేర్ సొసైటీ సభ్యులను ఛైర్మన్ సుధీర్రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్.రెడ్డి, ఎంఆర్డీసీఎల్ అధికారులు పాల్గొన్నారు.