హుజురాబాద్​ అభ్యర్థి ప్రకటనకు ముహూర్తం ఫిక్స్

by  |
huzurabad-name 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్​ ఉప ఎన్నిక కోసం అభ్యర్థిని ఖరారు చేసేందుకు టీపీసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపనున్నట్లు సమాచారం. కొంతమంది పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నా.. సురేఖను పోటీకి దింపాలని టీపీసీసీ భావిస్తోంది. దీనిలో భాగంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్​ ఆదివారం హుజురాబాద్​అభ్యర్థి ప్రకటన చేయనున్నారు. కరీంనగర్‌లో పార్టీ నేతలతో విస్తృత సమావేశాన్ని నిర్వహించారు.

ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ ఠాగూర్​ఆదివారం ఉదయం రాష్ట్రానికి రానున్నారు. నేరుగా కరీంనగర్‌కు వెళ్లి అక్కడ పార్లమెంటరీ స్థాయి కాంగ్రెస్​ నేతల సమావేశంలో పాల్గొననున్నారు. ఇదే సందర్భంగా హుజురాబాద్​అభ్యర్థి పేరును ఖరారు చేయనున్నారు. అనంతరం సోమవారం గాంధీభవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హుజురాబాద్​ఉప ఎన్నికలు, దళిత, గిరిజన దండోరా తదితర అంశాలపై చర్చించనున్నారు.

Next Story