PRTU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి

by  |
Mohan Reddy
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడిగా పొద్దుటూరి మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జిల్లా కేంద్రంలో పీఆర్‌టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు, జిల్లా అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కార్యవర్గం ఎన్నిక శనివారం జరిగింది. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పొద్దుటూరి మోహన్ రెడ్డి‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర గౌడ్ ఎన్నికయ్యారు. మోహన్ రెడ్డి గతంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఉన్నారు. తనను ఎన్నుకున్న 29 మండలాల కార్యవర్గ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి అందరితో కలిసి ముందుకు సాగుతానని అన్నారు. తనను ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు, ఎమ్మెల్సీలకు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Next Story

Most Viewed