విష్ణు గెలిచాక.. ఇద్దరు ముఖ్యమంత్రులను కలుస్తా : మోహన్ బాబు

by  |
Dr. Mohan Babu
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మా’ ఎన్నికలపై డాక్టర్ మోహన్ బాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎవరు ఏం చేసినా.. ‘మా’ అనేది ఒక కుటుంబం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు టాలీవుడ్‌లోని ప్రతీ నటుడి కుటుంబసభ్యుడి వంటి వాడని అన్నారు. ఓటేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటేయండి అని పిలుపునిచ్చారు. విష్ణు గెలిచాక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తామని వెల్లడించారు. సినీ పరిశ్రమ కష్టాలను ముఖ్యమంత్రులకు చెప్పుకొని, పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నీ విష్ణు నెరవేరుస్తాడని నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed