నేడు ఒలింపిక్స్ అథ్లెట్స్‌తో ప్రధాని మోడీ కీలక సమావేశం..

by  |
Tokyo Olympics Starts
X

దిశ, వెబ్‌డెస్క్ : ఒలింపిక్స్ క్రీడాకారులతో భారత ప్రధాని మోడీ నేడు సమావేశం కానున్నారు. సాయంత్రం 5గంటల ప్రాంతంలో వర్చువల్‌ మీట్‌ ద్వారా క్రీడాకారులతో చర్చించనున్నారు. జపాన్ రాజధాని టోక్యో‌లో జరగనున్న ఒలింపిక్స్ -2021లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న అథ్లెట్స్‌లో ప్రధాని స్ఫూర్తి నింపనున్నారు.

జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కొవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. ఈ ఏడాది కూడా ఒలింపిక్స్ ఉండకపోవచ్చునని అంతా భావించగా.. ఎలాగైనా గేమ్స్ నిర్వహించి తీరుతామని జపాన్ క్రీడాశాఖ అధికారులు వెల్లడించారు.



Next Story

Most Viewed