నేడు జాతినుద్దేశించి ప్రసంగిచనున్న మోదీ

by  |
pm-modi
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని ఓ ట్వీట్ లో ప్రధాని కార్యాలయం పేర్కొంది. భారత్ కొవిడ్ వ్యాక్సినేషన్‌లో బిలియన్ మార్క్ దాటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఈరోజు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ బిలియన్ మార్క్‌ను దాటింది. ఈమేరకు గురువారం కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో వంద కోట్ల డోసుల వ్యాక్సినేషన్ ను మొదటగా చైనా అధిగమించగా తర్వాత భారత్ ఆ రికార్డు ను కైవసం చేసుకుంది.


Next Story

Most Viewed