- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని అవహేళన చేసే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారనీ, ఆయన వైఖరిని ఖండిస్తున్నట్టు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,బీజేపీ పూటకు ఒకలా మాట్లాడటం సరికాదన్నారు. నాడు ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సుష్మా స్వరాజ్ మద్దతు ఇవ్వడం వల్లే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయ్యిందని గుర్తుచేశారు. ప్రధాని తెలంగాణ ప్రజలనే కాదు.. సుష్మా స్వరాజ్నూ కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. మోడీ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని కోరారు. నిజాలు తెలుసుకుని తెలంగాణ ప్రజలను గౌరవించేలా మాట్లాడితే మంచిదని హితవు పలికారు.
Next Story