పేదల కోసం ఆధునిక వైద్యసేవలు

by  |

దిశ, వరంగల్: పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక వైద్య సామగ్రి సమకూర్చిందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. శనివారం మహబూబాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య సామగ్రిని జడ్పీ ఛైర్ పర్సన్ ఆంగోతు బిందు, కలెక్టర్ గౌతమ్, పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవితతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కట్టడి నేపథ్యంలో ఆస్పత్రుల ఆధునికీకరణపై దృష్టి పెట్టామన్నారు. మే 7 వరకు లాక్‎డౌన్ ఉన్నందున ప్రజలు సహకరించాలని, సామాజిక దూరం పాటించాలని పరిశుభ్రతగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Tags: satyavathi rathod, maloth kavitha, Modern medical services, poor, mahabubnagar

Next Story

Most Viewed