సుబ్బయ్య కుటుంబానికి రూ.20 లక్షల సాయం..

by  |
సుబ్బయ్య కుటుంబానికి రూ.20 లక్షల సాయం..
X

దిశ, ఏపీబ్యూరో : టీడీపీ అధికారప్రతినిధి సుబ్బయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ పార్టీ తరపున రూ.20 లక్షలు ప్రకటించారు. కడప జిల్లా పొద్దుటూరులో గురువారం సుబ్బయ్య అంత్యక్రియల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సుబ్బయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. సుబ్బయ్య పిల్లలను చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని చెప్పారు. సుబ్బయ్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై 15 రోజుల్లోగా పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేయకపోతే రాయలసీమవ్యాప్తంగా ఉద్యమిస్తామని లోకేష్‌ హెచ్చరించారు.

Next Story

Most Viewed