రైతులతో చెలగాటం ఆడుతున్నారు

by  |
రైతులతో చెలగాటం ఆడుతున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కనీస మద్ధతు ధరపై డ్రామాలు ఆడుతూ రైతుల చెలగాటం చేస్తున్నారని విమర్శించారు. మొక్కజొన్న పంటకు మద్ధతు ధర ఇచ్చి చట్టాల గురించి మాట్లాడాలని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం… చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పేర్కొన్నారు. అసెంబ్లీని సమావేశపరిచి వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని వెల్లడించారు.

Next Story