- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కామారెడ్డి: నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఉద్యోగాలు లేవని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావడంతో డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువతకు నిరుద్యోగ భృతి లేదన్నారు. ప్రైవేటు టీచర్లు, జూనియర్ లెక్చరర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి, పోసానిపేట సర్పంచ్ గీతా రెడ్డి మహేందర్ రెడ్డి, నాయకులు షేరు, గోనె శ్రీనివాస్, సిరాజుద్దీన్, గుడుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Next Story