వరద ప్రభావిత కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే

by  |
వరద ప్రభావిత కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే
X

దిశ, పటాన్‌చెరు:
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ధాటికి గురైన కృషి డిఫెన్స్ కాలనీలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో సహాయ కార్యక్రమాలను చేపడుతున్న అధికారులతో సమీక్షించారు. గత రెండు రోజుల నుంచి కాలనీవాసులకు నిత్యావసర సరుకులు, మంచినీళ్లను ఎప్పటికప్పుడు అందించినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వెంట టీఆర్ఎస్ నేతలు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed