ముగిసిన NDA భాగస్వామ్య పక్షాల భేటీ.. ఏపీలో తేలిన రాజ్యసభ సీట్ల లెక్కలు

by Kema Shiva Kumar |

ఏపీలో రాజ్యసభ ఎన్నికల సీట్ల సర్దుబాటు పక్రియ పూర్తి అయింది.

ముగిసిన NDA భాగస్వామ్య పక్షాల భేటీ.. ఏపీలో తేలిన రాజ్యసభ సీట్ల లెక్కలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు (Cm Chandrababu) అధ్యక్షతన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం ముగిసింది. ఈ భేటీకి జనసేస చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమిలోని పార్టీల బలాబలాల ఆధారంగా సీట్ల సర్దుబాటుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉన్న నాలుగు సీట్లలో జనసేనకు ఒకటి, మిగిలిన మూడు సీట్లు కూడా టీడీపీకి కేటాయించాలని నిర్ణయించారు. త్వరలో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని రెండు పార్టీల అధినేతలు తెలిపారు.

Next Story