రాజీనామా చేయడానికి సిద్ధం.. కానీ !

by  |
రాజీనామా చేయడానికి సిద్ధం.. కానీ !
X

దిశ, వెబ్‌డెస్క్: గన్నవరం నియోజకవర్గంలో అందర్ని కలుపుకుని ముందుకు వెళ్తానని, వైసీపీ, టీడీపీ నేతలు తనతోనే ఉన్నారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని, గత ప్రభుత్వం కంటే జగన్ సర్కార్ మెరుగ్గా పనిచేస్తుందని తెలిపారు. పోలవరం కుడి కాలువ నుంచి రైతులు 600 మోటార్ల ద్వారా నీరు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు చంద్రబాబు విద్యుత్ కనెక్షన్లు క్రమబద్దీకరణ చేయలేదని మండిపడ్డారు. ప్రస్తుతం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లడానికి నేను సిద్ధం.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, అన్ని గ్రూపులను కలుపుకొని వెళ్తానని వెల్లడించారు.


Next Story

Most Viewed