జింకల పార్కు వద్ద అధునాతన బస్ టెర్మినల్

by  |
జింకల పార్కు వద్ద అధునాతన బస్ టెర్మినల్
X

దిశ, ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఆటోనగర్ జింకల పార్కు వద్ద అధునాతనమైన బస్ టెర్మినల్ నిర్మించనున్నట్టు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఈ సందర్భంగా మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, పలువురు ఫారెస్ట్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే జింకల పార్క్ ఎదుట నిర్మించతలపెట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు. దీనికి పర్యావరణ అనుమతులు కావాలని, ఏకో సెన్సిటీవ్ ప్రదేశంలో ఉందని, గోడ నుంచి కొంత స్థలం విడిచి నిర్మాణాలు చేపట్టాలని అటవీశాఖ అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు పొంది పర్యావరణ అనుమతులు, అటవీశాఖ అధికారులతో తీసుకుని నిర్మాణాలు జరుగుతాయని తెలిపారు.



Next Story

Most Viewed