అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు

by  |
అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు
X

దిశ, ఎల్బీనగర్: నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శించరాదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచించారు. సోమవారం నాగోల్ డివిజన్‌లోని ఓ ఫంక్షన్ హాలులో నియోజకవర్గ అభివృద్ధి పనులపై అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. నియోజకవర్గంలో డ్రైనేజీ, రోడ్లు, మహిళా భవనాలు, స్మశానవాటిక పనులు, మంచినీటి లైన్లు, ఇతర పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు విజయ కృష్ణ, మారుతీ దివాకర్, హరి కృష్ణయ్య, కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, ముద్రబోయిన శ్రీనివాసరావు, జిన్నారం విఠల్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story