పైసా లంచం లేదు.. పైరవీ అసలే లేదు : పెద్ది సుదర్శన్ రెడ్డి

by  |
Peddhi-Sudharshan-Reddy-1
X

దిశ, నర్సంపేట టౌన్: పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 95 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైసా ఖర్చు లేకుండా, పైరవీలు ఏమాత్రం లేకుండా కల్యాణలక్ష్మి చెక్కులను సాధ్యమైనంత త్వరగా అందజేస్తున్న విధానాన్ని ఆయన లబ్ధిదారులకు వివరించారు. అమ్మాయిల తల్లిదండ్రులు చదువుపై దృష్టి పెట్టాలని, తద్వారా ఆర్థికంగా ఎదిగే అవకాశముంటదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, ఆర్డీవో పవన్ కుమార్, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు రఫీ, ఎంపీపీలు విజేందర్, రమేష్, ప్రకాష్ రావు, కాట్ల కోమల భద్రయ్య, జెడ్పీటీసీ పత్తినాయక్, సరోజ హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed