వైద్య సిబ్బందికి షాక్.. ఆకస్మికంగా ఆసుపత్రికి సీతక్క..

by  |
వైద్య సిబ్బందికి షాక్.. ఆకస్మికంగా ఆసుపత్రికి సీతక్క..
X

దిశ, మంగపేట: బ్రాహ్మణపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించిన సీతక్క, ఆసుపత్రిలో మందుల కొరత, సిబ్బంది హాజరు, ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను వైద్యురాలు ట్వింకిల్ నిఖితను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే సీతక్క ఆసుపత్రిలో షుగర్, బీపీ, రక్త పరీక్షలు చేయించుకున్నారు. వైద్యురాలు ట్వింకిల్ నిఖిత, వైద్య సిబ్బంది సేవలు ఆసుపత్రి నిర్వాహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ శైలజ, ఫార్మసిస్టు స్వర్ణలత, ఎల్టీ రామస్వామి, ఏఎన్ఎం, ఆశలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed