- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభానుపై 10 కేసులు ఉపసంహరించుకుంటూ.. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఏపీ జేఎఫ్ అధ్యక్షుడు కృష్ణాంజనేయులు హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కేసుల ఉపసంహరణ వ్యవహారంలో ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఒక్క జీవోతో 10 కేసులు ఎలా ఉపసంహరించుకుంటారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
ఈ కేసుల విషయంలో ప్రభుత్వం జీవో ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ఎమ్మెల్యే ఉదయభానుకు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్ తన వాదనలు వినిపించారు. మూడువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
Next Story