శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా…స్పెషల్ ఏంటంటే

by  |
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా…స్పెషల్ ఏంటంటే
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తన జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే రోజాకు ప్రత్యేక ఆశీర్వాచనలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం జగన్‌ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే రోజా తెలిపారు.

మంత్రుల సమక్షంలో రోజా బర్త్ డే సెలబ్రేషన్స్
తాడేపల్లిలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణల సమక్షంలో రోజా తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఎమ్మెల్యే రోజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed