సెల్ఫ్ క్వారంటైన్‌: రోజా ఏమంటుందంటే..?

by  |
సెల్ఫ్ క్వారంటైన్‌: రోజా ఏమంటుందంటే..?
X

దిశ, ఏపీ బ్యూరో: తాను క్షేమంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా తెలిపారు. రోజా గన్‌మెన్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆయనను తిరుపతి స్విమ్స్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆమె సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. దీంతో రోజా కూడా వైరస్ బారిన పడ్డారని ఆమె ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రోజా స్పందించారు. తాను, తన కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగానే ఉన్నామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.


Next Story

Most Viewed