చంద్రబాబు, లోకేశ్ తట్ట, బుట్టా సర్దుకుని పోవాలి.. ఎమ్మెల్యే రోజా

by  |
roja
X

దిశ, ఏపీ బ్యూరో: కుప్పం ఫలితాలపై వైసీపీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా తనదైన స్టైల్‌లో స్పందించారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో తండ్రీ కొడుకులు ఇద్దరూ తట్ట, బుట్టా సర్దుకుని హైదరాబాద్ పోవాలని చురకలు అంటించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా వార్ వన్ సైడేనని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలు ఎప్పుడు జగన్ వైపే ఉంటారని ఆమె స్పష్టం చేశారు. ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్టీ అయిన చంద్రబాబును కుప్పం ప్రజలు తరిమి కొట్టారని అన్నారు. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును హైదరాబాదు ఇంటికి పరిమితం చేశారంటూ రోజా తనదైన స్టైల్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed