నేను ఉన్నా.. ఎవ్వరూ అధైర్యపడొద్దు : విప్ రేగా కాంతారావు

by  |
నేను ఉన్నా.. ఎవ్వరూ అధైర్యపడొద్దు : విప్ రేగా కాంతారావు
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం, పినపాక మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు. ఆదివారం అనారోగ్య, వివిధ సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు నేను ఉన్నాను. ఎవ్వరూ అధైర్యపడవద్దని ప్రజలకు సూచించారు.

పదవి కన్నా.. నా కుటుంబం కన్నా.. ప్రజలు, వారి ఆరోగ్యమే తనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. రేగా అండగా ఉంటాడని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి లేదా తన ఇంటివద్దకు వచ్చి తెలపాలని ప్రజలకు తెలియజేశారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర రోగాల బారిన పడినా.. ఎవ్వరూ అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed