‘మంచి చేయాలనే మనసుంటే చాలు.. పదవులక్కర్లేదు’

by  |
‘మంచి చేయాలనే మనసుంటే చాలు.. పదవులక్కర్లేదు’
X

దిశ, నల్లగొండ: ప్రజలకు మంచి చేయాలంటే పదవులు అవసరం లేదనీ, మనసుంటే చాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీ చౌటుప్పల్ మున్సిపాలిటీలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా వైరస్ కట్టడి విషయంలో సీఎం కేసీఆర్‌ను అభినందిస్తున్నానన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి పాటు పడాలని కోరారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 40వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

tag: mla rajagopal reddy, daily needs, distribution, nalgonda

Next Story