గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబట్టిన దుబ్బాక ఎమ్మెల్యే..

by  |
గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబట్టిన దుబ్బాక ఎమ్మెల్యే..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగం ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. బుధవారం సెషన్స్ ప్రారంభమయ్యాక గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఇచ్చిన ప్రసంగాన్ని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తప్పుబట్టారు. గవర్నర్ ప్రసంగం ఉద్యమ స్ఫూర్తికి భిన్నంగా ఉండటం బాధాకరమన్నారు.

తెలంగాణ ప్రజలు మరో ఉద్యమం వైపు అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోందని కామెంట్స్ చేశారు. సభ పరిధిలో లేని అంశాలను సభలో చర్చించడం సభ్యులకు తగదని సూచించారు. బీజేపీపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రం రిజర్వేషన్లు ఎత్తివేస్తుందనడం అవాస్తమని దుబ్బాక ఎమ్మెల్యే తేల్చిచెప్పారు.

Next Story