పిచ్చి మందు తాగి ఇష్టమెుచ్చినట్లు రచ్చ చేస్తారా?

by  |
పిచ్చి మందు తాగి ఇష్టమెుచ్చినట్లు రచ్చ చేస్తారా?
X

దిశ, ఏపీ బ్యూరో : వరద బాధితులపై నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి మందు తాగేసి మీ ఇష్టమొచ్చినట్టు రచ్చ చేస్తారా? అంటూ మండిపడ్డారు. పక్క జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని మన దగ్గరకు తీసుకువస్తే డౌన్ డౌన్ అంటారా అని ప్రశ్నించారు. బుద్ది ఉందా.. సిగ్గుందా మీకు అంటూ విరుచుకుపడ్డారు. ఇన్‌చార్జ్ మంత్రిని ఆ ప్రాంతం చూపిద్దామని తీసుకొస్తే.. అరిస్తే ఏమొస్తది.. ఏం చేయగలుగుతారు? అంటూ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిలదీశారు. ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అందరికీ న్యాయం చేయాలన్నదే మా తాపత్రాయమని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వెల్లడించారు. వరద బాధితులకు తాము అండగా ఉంటామని..నష్టపోయిన ప్రతీ ఒక్కరినీ ఆదుకునేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇకపోతే మంగళవారం కోవూరులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, కలెక్టర్ చక్రధర్‌బాబులు పర్యటించేందుకు వెళ్లారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పరామర్శించి వారి బాధలను తెలుసుకోవాలని వెళ్లారు. అయితే వరద బాధితులు మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్‌పై రెచ్చిపోయారు. ఇప్పుడెందుకు వచ్చారంటూ నిరసన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed