ఆధ్యాత్మిక చింతనతో.. మానసిక ప్రశాంతత

by  |
ఆధ్యాత్మిక చింతనతో.. మానసిక ప్రశాంతత
X

దిశ, ముషీరాబాద్: ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతతను చేకూరుస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని లక్ష్మీ గణపతి దేవాలయంలో ఆలయ ధర్మకర్తల నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాలల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందన్నారు. అనంతరం లక్ష్మీ గణపతి దేవాలయం చైర్మన్‌గా ఎన్నికైన ముచ్చ కుర్తి ప్రభాకర్ మరియు ఆలయ పాలకమండలి సభ్యులు, మాజీ చైర్మన్ మాచర్ల పద్మజ లను సన్మానించి అభినందించారు.



Next Story

Most Viewed