‘ఆ జీవోను ఉపసంహరించుకోవాలి’

by  |
‘ఆ జీవోను ఉపసంహరించుకోవాలి’
X

దిశ, నల్లగొండ: పోతిరెడ్డిపాడు ఎత్తు పెంపుపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం మానుకోవాలని జగన్‌ను కోరారు. పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ ఎత్తు పెంపు అనైతికమని, తద్వారా సాగర్​కు నీరు రాకుండా చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. అక్కడి​ ప్రభుత్వం… తన వాటా నీటిని వినియోగించుకోవాలే తప్ప తెలంగాణ వాటాలో భాగం అడగకూడదన్నారు. ఈ మేరకు ఏపీ సర్కారు విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని నోముల డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed