- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : టీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందించారు. తాను ఎక్కడా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, కావాలనే ఆ విలేకరి తనపై తప్పుడు కథనాలు ప్రచురించి నా ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు.
అందుకే అతనితో ఆవేశంతో మాట్లాడినట్లు వెల్లడించాడు. తనను బ్లాక్ మెయిల్, బెదిరింపులకు గురిచేసి కోట్లు సంపాదించాడని చెప్పారు. కావాలంటే విలేకరి కోట్లు సంపాదించిన విషయాన్ని నిరూపిస్తానని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ఇదిలాఉండగా, మహిపాల్ రెడ్డి ఫొన్లో విలేకరితో అసభ్యకరంగా మాట్లాడటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అతనిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైంది.
Next Story