ఆలోచింపజేస్తున్న ‘దిశ’ కథనాలు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

by  |
ఆలోచింపజేస్తున్న ‘దిశ’ కథనాలు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
X

దిశ, జడ్చర్ల: సమగ్ర రాజకీయ, సామాజిక కథనాలతో వెలువడుతున్న దిశ పత్రిక పాఠకులను, ప్రజలను ఆలోచింపజేస్తుందని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మిడ్జిల్ మండలంలోని బోయినపల్లిలో దిశ క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంఘం చైర్మన్ లోక భూమా రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ కాలంలోనే దిశ దినపత్రిక లక్షల సంఖ్యలో పాఠకుల అభిమానాన్ని, విశ్వాసాన్ని సంపాదించుకుందని కొనియాడారు. క్యాలెండర్ ఆవిష్కరణలో జడ్చర్ల దిశ రిపోర్టర్ నిస్సార్ అహ్మద్, ఎంపీపీ కాంతమ్మ, బాలస్వామి జెడ్పీటీసీ శశిరేఖ బాలు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బోయిన్ పల్లి సర్పంచ్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed