ప్రభుత్వానికి, పాలకులకు వారధిగా ఉండాలి :కొప్పుల

by  |
ప్రభుత్వానికి, పాలకులకు వారధిగా ఉండాలి :కొప్పుల
X

దిశ, పరిగి: అన్యాయాన్ని, అక్రమాలను వెలికితీస్తూ ప్రభుత్వానికి, పాలకులకు, ప్రజలకు వారధిగా పత్రికలు పనిచేయాలని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​రెడ్డి పేర్కొన్నారు. పరిగిలోని తన నివాసంలో గురువారం ‘దిశ’ దినపత్రిక నూతన సంవత్సరం 2021 క్యాలెండర్​ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. అనతి కాలంలోనే ‘దిశ’ పత్రిక అందరి మన్ననలు పొందుతూ అంతకంతకు ఎదుగుతుందన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్​రెడ్డి, దోమ జెడ్పీటీసీ నాగిరెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ బేతు ప్రవీణ్​కుమార్​రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రొయ్యల ఆంజనేయులు, నాయకులు అంతిగారి సురేందర్​ కుమార్​, ధీరుబాబు, కౌన్నిలర్ బెస్త వెంకటేశ్, పరిగి మాజీ ఉప సర్పంచ్ బషీర్​, టీఆర్​ఎస్​ పరిగి పట్టణ ప్రచార కార్యదర్శి బలాల, ‘దిశ’ దినపత్రిక పరిగి నియోజకవర్గ ఇంచార్ పొతెదార్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed