కేసీఆర్ పెద్దకొడుకు పాత్ర పోషిస్తోన్న కలెక్టర్..!

by  |
Congress MLA Jagga Reddy
X

దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నిక సమీపిస్తున్నందున నియోజకవర్గంలో పార్టీల ప్రచారహోరు జోరందుకుంది. అధికారపార్టీ తరఫున ట్రబుల్ షూటర్, రాష్ట్ర మంత్రి హారీష్ రావు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ తరఫున ఆ పార్టీల ముఖ్య నాయకులు విరివిగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఎన్నికల ప్రచారం, పోలింగ్ ప్రక్రియ ముగియక ముందే గెలుపు ఎవరిదనే అంశంపై సిద్ధిపేట కలెక్టర్ చేస్తున్న వ్యాఖ్యలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జగ్గారెడ్డి.. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిస్తే రాష్ట్ర ప్రజలకు శాపమేనని అన్నారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కేసీఆర్‌కుపెద్దకొడుకు పాత్ర పోషిస్తున్నారని ఆయన విమర్శించారు. ఫలితాలు రాకముందే టీఆర్‌ఎస్‌ గెలిచినట్లు ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కారు గెలిస్తే మళ్లీ కేసీఆర్‌ కాలర్ ఎగురవేస్తాడని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లినా, ఓటర్లు పట్టించుకోపోతే తెలంగాణను ఎవ్వరూ కాపాడలేరని జగ్గారెడ్డి చెప్పారు.

Next Story

Most Viewed