అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు

by  |

దిశ, మహబూబ్ నగర్: రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్‌లో కూరగాయల మార్కెట్ ను ఎమ్మెల్యే సందర్శించారు. కరోనా వైరస్ బారి నుంచి కాపాడుకోవాలంటే ఇంటి నుంచి ఎవరు బయటకు రాకూదన్నారు. అనంతరం చిన్నంబావి మండలం పెద్దామారుర్ గ్రామంలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ సోమేశ్వరమ్మ , మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి, సర్పంచ్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

tag;mla beram harshavardhan reddy, kollapur, ts news


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed