మొక్కలు నాటడం.. సామాజిక బాధ్యత

by  |
మొక్కలు నాటడం.. సామాజిక బాధ్యత
X

దిశ, ఎల్బీనగర్​ : ఇంటి ముందు, కాలనీ పరిసర ప్రాంతాల్లో ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​ రెడ్డి సూచించారు. హరితహారంలో భాగంగా గురువారం మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని పవనగిరి కాలనీ ఫేస్ 1, 2 లలో స్థానిక కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతగా తమ, తమ ఇంటి ముందు, కాలనీ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed