సేవే మార్గం.. అభివృద్ధే లక్ష్యం

by  |
సేవే మార్గం.. అభివృద్ధే లక్ష్యం
X

దిశ, ఎల్బీనగర్: సేవే మార్గంగా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డితో కలిసి పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

రూ.3.85 కోట్ల వ్యయంతో డివిజన్ పరిధిలోని జడ్జెస్ కాలనీలో పార్కు, బాలాజీనగర్లో మట్టి రోడ్డు నిర్మాణం, వినాయకనగర్ కాలనీలో సీసీ రోడ్డు, ఎల్లారెడ్డి కాలనీలో సీసీ రోడ్డు, మిగిలిపోయిన భూగర్భ డ్రైనేజీ ట్రంక్ లైన్, ప్రగతినగర్లో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.



Next Story

Most Viewed