ఎమ్మెల్యే ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by  |
ఎమ్మెల్యే ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలకు స్వార్థం తప్ప రాముడిపై చిత్తశుద్ది లేదన్నారు. రాజకీయం కోసం శ్రీరాముడిని బీజేపీ వాడుకుంటోందని చెప్పారు. రాముడిని మొక్కని భారతీయుడు లేడన్నారు. కానీ రాముడిని రాజకీయాల్లోకి లాగి అపవిత్రం చేస్తున్నారని చెప్పారు. అయోధ్య నిర్మాణం పేరుతో దొంగ బుక్కులు అకౌంటబులిటీ బుక్కులు పట్టుకొని చందాలు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. వసూలు చేస్తున్న డబ్బులు ఎక్కడికి పోతున్నాయో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బుల లెక్కలు చెప్పకపోతే రాముడి తరఫున పోరాటం చేస్తామన్నారు.

Next Story

Most Viewed