ఏడు నెలల్లో ఉదయసముద్రం పూర్తి.. ఎమ్మెల్యే చిరుమర్తి హామీ

by  |
MLA Chirumarthi Lingaya
X

దిశ, నకిరేకల్: బ్రాహ్మణ వెల్లంల, ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఏడు నెలల్లో ప్రాజెక్టును పూర్తిచేసి రైతాంగానికి నీరు అందిస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హామీ ఇచ్చారు. పట్టణంలో సోమవారం నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు ఎవరూ అపోహలకు గురికావొద్దని, సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తామని తెలిపారు. కేవలం నార్కట్‌పల్లి మండలంలో కోటి యాభై లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేస్తున్నామంటే, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయో అర్థం చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ ఇంటి పెద్దదిక్కుగా ఉంటూ అందరికీ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దోసపాటి విష్ణుమూర్తి, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed