- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, పరకాల: హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో సోమవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హల్ చల్ సృష్టించారు. ఉదయం 5 గంటలకే మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో సిబ్బంది హాజరు శాతంపై ఆరా తీశారు. పట్టణంలోని పలు వీధుల్లో మున్సిపల్ కమిషనర్ తిరునాహరి శేషుతో కలిసి పాత ఏటీఎం, బస్టాండ్, ఎల్లంపల్లి రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ పారిశుద్ధ్యం తదితర విషయాలపై సమీక్షించారు. విధుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సరైన చర్యలు చేపట్టాలని కమిషన్కు సూచించారు. విధుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం స్థానిక కుంకుమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పరకాల పట్టణ అధ్యక్షులు మడికొండ శీను, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి సారంగపాణి, కౌన్సిలర్లు గోపి, మడికొండ సంపత్ తదితరులు ఉన్నారు.