జర్నలిస్టులను బెదిరించిన MLA చల్లా అనుచరులు.. నల్ల బ్యాడ్జీలతో నిరసన

by  |
Katram
X

దిశ, కాటారం : న్యూస్ చానల్ రిపోర్టర్‌పై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు బెదిరింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు నిరసన చేపట్టారు. సోమవారం భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ సెంటర్‌లో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ వాస్తవాలను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని వారు ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఇప్పటికే తొలివెలుగు జర్నలిస్ట్ రఘు, క్యూ న్యూస్ మల్లన్నతో పాటు పలువురు జర్నలిస్టులపై ఎలాంటి ఫిర్యాదులు లేకున్నా మఫ్టీలో వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి భయానక వాతావరణం సృష్టించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని మహదేవపూర్ జర్నలిస్టులు కోరారు.



Next Story

Most Viewed