బిగ్‌బ్రేకింగ్ : ఈటల జమున సంచలన కామెంట్స్.. పార్టీ గుర్తు ఒకటే కానీ..?

by Vadlamudi Anukaran |   (  Updated:2023-10-10 16:26:11  IST  )

<p>దిశ, హుజురాబాద్ :  హుజురాబాద్ ఉపఎన్నికలో ఎవరు నిలబడాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇద్దరమూ ప్రజల్లో ఉండాలన్నదే మా ఉధ్దేశ్యం. కాకపోతే గుర్తు మాత్రం సేమ్ ఉంటుంది. మనుషులు మారుతారంతే.. అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ కామెంట్స్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నుండి తాను పోటీ చేసినా.. రాజేందర్ పోటీ చేసినా.. ఒకటేనని భావిస్తున్నామని […]</p>

etala-jamuna
X

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నికలో ఎవరు నిలబడాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇద్దరమూ ప్రజల్లో ఉండాలన్నదే మా ఉధ్దేశ్యం. కాకపోతే గుర్తు మాత్రం సేమ్ ఉంటుంది. మనుషులు మారుతారంతే.. అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె..

ఈ కామెంట్స్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నుండి తాను పోటీ చేసినా.. రాజేందర్ పోటీ చేసినా.. ఒకటేనని భావిస్తున్నామని జమున అన్నారు. ఉద్యమ ప్రస్థానంలో అయినా, ప్రచారంలో ఐనా తాను రాజేందర్ వెన్నంటే ఉన్నానని గుర్తుచేశారు. కావున ఎవరికి ఛాన్స్ వస్తే వాళ్లు పోటీచేసే అవకాశం ఉంటుందన్నారు. కాకపోతే గుర్తు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒకటే ఉంటుందని, మనుషులు మాత్రం మారే చాన్స్ ఉందని జమున వెల్లడించారు.

Next Story