ఏపీలో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు పర్యటన

by  |
Mizoram Governor
X

దిశ, ఏపీ బ్యూరో : మిజోరాం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు బుధవారం హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయనకు కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ గన్నవరం నుండి రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సీపీ శ్రీనివాసులు, నూజివీడు రెవెన్యూ డివిజినల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story