అదృశ్యమైన తల్లీకూతుళ్లు దారుణహత్య..

by  |
అదృశ్యమైన తల్లీకూతుళ్లు దారుణహత్య..
X

దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మూడు నెలల కిందట కనిపించకుండా పోయిన తల్లీకూతుళ్లు దారుణహత్యకు గురయ్యారు. సరళ, గంగమ్మ ఆచూకీకోసం బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

అయితే, ఆ ఫిర్యాదును వారు పట్టించుకోలేదని సమాచారం.దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టగా స్పందించిన పోలీసులు నిందితుడు మౌలాలిని అదుపులోనికి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే జంటహత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed