పోటీ నుంచి తప్పుకోలేదని.. అభ్యర్థి కూతురుపై అత్యాచారం

by  |
పోటీ నుంచి తప్పుకోలేదని.. అభ్యర్థి కూతురుపై అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోలేదని దుర్మార్గానికి పాల్పడ్డాడో ప్రత్యర్థి అభ్యర్థి. తనకు పోటీగా ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థిని ఢీకొనలేక.. అతడి కూతురుని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడో నీచుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలో కొద్ది రోజుల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే జిల్లాలోని ఓ గ్రామంలో ఎన్నికల బరిలో నిలిచేందుకు ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. సర్పంచ్ గా పోటీ చేస్తానని ప్రకటించాడు. ఆ విషయం నచ్చని గ్రామానికి చెందిన వ్యక్తి.. అతడిని పోటీ నుంచి తప్పుకోవాలని సూచించాడు. అయినా పోటీ చేస్తానని పట్టుబట్టడంతో పలు విధాలుగా బెదించడంతోపాటు హెచ్చరికలు చేశారు.

అయినా సదరు వ్యక్తి పోటీ నుంచి తప్పుకోనని చెప్పడంతో అతడి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. స్కూల్‌కు వెళ్లొస్తున్న పదో తరగతి చదివే అతడి కూతురును మంగళవారం కిడ్నాప్ చేశారు. బాలికను ఓ గదిలో బంధించి ఆకాశ్‌ వర్మ, లాల్‌జీ వర్మ, సచిన్‌ వర్మ, శివమ్‌ వర్మ కలిసి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఇంటికి వచ్చిన బాలిక జరిగిన విషయం తండ్రికి చెప్పడంతో ఆయన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోటీ నుంచి తప్పుకోక పోవడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఘటనపై కేసు నమోదు చేశామని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఏఎస్పీ మనోజ్ పాండే తెలిపారు. బాలికను వైద్య పరీక్షలకు తరలించామని, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.


Next Story