తల్లితో వివాహేతర సంబంధం.. కూతురిపై అఘాయిత్యం

by  |
తల్లితో వివాహేతర సంబంధం.. కూతురిపై అఘాయిత్యం
X

దిశ, క్రైమ్ బ్యూరో: తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే.. కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడో ప్రబుద్ధుడు. కూతురి ద్వారా విషయం తెలుసుకున్న తల్లి ఫిర్యాదు మేరకు విషయం వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురం సీఐ వెంకటయ్య కథనం ప్రకారం..శ్రీనివాస కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ కుటుంబంలో నెలకొన్న వివాదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్నది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇబ్రహీంపట్నం పటేల్ గూడకు చెందిన నర్సింహ యాదవ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది.దీంతో అతడు తరుచూ ఆ మహిళ ఇంటికి వచ్చేవాడు. కొద్దిరోజుల తర్వాత ఆమె తిరస్కరించే సరికి బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక సంబంధాన్నికొనసాగిస్తూ వచ్చాడు.ఈ క్రమంలోనే యాదవ్ ఇంటికి వచ్చేసరికి తల్లి లేకపోవడంతో కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కలతగా ఉన్న తన కూతురు(17) గమనించిన తల్లి ఎమైంది అని అడుగగా జరిగిన విషయం తెలపింది. దీంతో బాధిత తల్లి వనస్థలిపురం పీఎస్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితునిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed