- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : తన పద్ధతి మార్చుకోవాలని కన్నతల్లి పలుమార్లు మందలించడంతో ఆ కూతురు జీర్ణించుకోలేకపోయింది. తనను, తన ప్రియుడిని కలుసుకోకుండా చేస్తుందని భావించిన మైనర్ ఏకంగా తల్లినే అడ్డుతొలగించుకోవాలని స్కెచ్ వేసింది. తండ్రి ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని మరీ తల్లితో గొడవకు దిగింది. ఈ క్రమంలోనే ఆమెను హత్యచేసి ఓ కట్టు కథ అల్లింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లో పరిధిలోని రాజేంద్రనగర్లో మంగళవారం వెలుగుచూసింది.
రాజేంద్రనగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఓ 17 ఏళ్ల మైనర్ బాలిక మరో బాలుడిని ప్రేమించింది. మేజర్స్ కాకముందే వీరిద్దరు పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బాలుడు తరచూ బాలిక ఇంటికి వచ్చిపోతుండేవాడు. అయితే, వీరి పెళ్లి విషయాన్ని ఆ బాలిక తల్లి తీవ్రంగా వ్యతిరేకించింది. ఇంకోసారి ఇంటి దగ్గర కనిపిస్తే బాగుండదని గట్టిగా హెచ్చరిచ్చింది. ఆ తర్వాత పద్ధతి మార్చుకోవాలని తన కూతురుని కూడా గట్టిగా మందలించింది. అయితే, తల్లి మాటలను అర్థం చేసుకోకుండా ఆ మైనర్ ఏకంగా కన్నతల్లిపైనే కక్ష కట్టింది. తన ప్రియుడిని కలుసుకోనివ్వకుండా చేస్తున్న తల్లిని అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసింది.
ఈ నేపథ్యంలోనే తండ్రి ఇంట్లో లేని సమయంలో అతన్ని ఇంటికి పిలిపించింది. కావాలనే తల్లితో గొడవ పెట్టుకుని.. ఆ తర్వాత ప్రియుడితో కలిసి చున్నీతో తల్లి మెడకు బిగించి హత్యచేసింది. అనంతరం ప్రమాదవశాత్తు కిందపడి అమ్మ చనిపోయిందని తండ్రిని నమ్మించే యత్నం చేసింది ఈ కసాయి కూతురు. అయితే, మృతురాలి మెడపై గాయాలు ఉండటాన్ని గుర్తించిన పోలీసులు తమ దైన స్టైల్లో విచారణ చేపట్టగా నిందితులు ఇద్దరూ నేరం అంగీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.