డబుల్ బె‎డ్‎రూమ్ ఇళ్లను సందర్శించిన మంత్రులు

by  |
డబుల్ బె‎డ్‎రూమ్ ఇళ్లను సందర్శించిన మంత్రులు
X

దిశ, పటాన్‌చెరు:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్‎రూమ్ ఇళ్ల నిర్మాణం చురుగ్గా కొనసాగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో డబుల్ బెడ్‎రూమ్ ఇళ్లను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. డబుల్ బెడ్‎రూమ్ ఇళ్ల నిర్మాణం, అక్కడ జరుగుతున్న పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంట్రాక్ట్ ఏజేన్సీతో పాటు అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సుమారు 85 వేల ఇళ్లను పేదలకు అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలోనే పేదల హౌసింగ్ కార్యక్రమాల్లో కొల్లూరు ఒక ఆదర్శమైన ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు.


Next Story