చెక్ డ్యాములను పరిశీలించిన మంత్రి.. సరదాగా ఓ సెల్ఫీ

by  |
చెక్ డ్యాములను పరిశీలించిన మంత్రి.. సరదాగా ఓ సెల్ఫీ
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం-ధర్మోరా వద్ద పెద్దవాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యామ్ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ కారణంగా నెమ్మదించిన పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెక్ డ్యామ్ నిర్మాణం పూర్తి అయితే వాగు వెంబడి బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు మేలు జరుగుతుందని ఆకాంక్షించారు. అనంతరం కాళేశ్వరం ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సరదాగా ఓ సెల్ఫీ తీసుకున్నారు.

Next Story

Most Viewed