రైతు వేదిక నిర్మాణానికి మంత్రి వేముల శంకుస్థాపన

by  |
రైతు వేదిక నిర్మాణానికి మంత్రి వేముల శంకుస్థాపన
X

దిశ, బాల్కొండ: రైతు వేదిక నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. వేల్పూరు, అమీన్‌పూర్, లక్కోర గ్రామాల క్లస్టర్‌కు సంబంధించి దివంగత వేముల సురేందర్‌రెడ్డి మెమోరియల్ రైతు వేదిక పనులను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అవకాశం ఉన్నచోట రైతు వేదికల నిర్మాణానికి దాతలు ముందుకు రావాలన్న సీఎం కేసీఆర్ సూచన మేరకు వేల్పూర్ క్లస్టర్ రైతు వేదిక నిర్మాణం సొంతంగా చేపట్టేందుకు ముందుకు రావడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed