"దిశ" పత్రిక బాగుంది : తలసాని కితాబు

by  |
దిశ పత్రిక బాగుంది : తలసాని కితాబు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ‘దిశ’ ఈ పేపర్ చాలా బాగుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కితాబిచ్చారు. మంగళవారం వెస్ట్ మారేడుపల్లిలోని మంత్రి నివాసంలో దినపత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల 2021 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిష్పక్షపాతమైన వార్తలను ప్రచురితం చేస్తూ ‘దిశ‘ పాఠకుల అభిమానాన్ని అనతికాలంలోనే పొందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దిశ పత్రిక నెట్‌వర్క్ ఇన్‌చార్జి శిరందాస్ ప్రవీణ్ కుమార్, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి కర్నాటి గోపీనాథ్, మేడ్చల్ జిల్లా ఇన్‌చార్జి రవిచంద్ర, రిపోర్టర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed